లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్ లు. ఇక్కడ భారత్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగగా, ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పోరుకు సిద్ధమైంది. ఈ రెండు జట్లు సెమీస్ కు చేరిన క్రమంలో ఫైనల్లో కూడా ఆ రెండు జట్లే చేరతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. దాంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఏకీభవించాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లే దాదాపు ఆడే అవకాశం ఉందని కోహ్లి పేర్కొన్నాడు.' ప్రతీ ఒక్కరు భారత్-ఇంగ్లండ్ ల ఫైనల్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లకు సెమీస్ లో కఠినమైన సవాల్ ఎదురైనప్పటికీ, ఫైనల్లో ఇంగ్లండ్ తో పోరుకే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారన్నాడు. ఫైనల్ పోరులో ఏ జట్లు పోటీ పడతాయన్న ప్రశ్నకు ఓ కార్యక్రమానికి హాజరైన విరాట్ పై విధంగా సమాధానం ఇచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-పాక్ ల మధ్య తొలి సెమీస్ జరుగనుండగా, గురువారం భారత్-బంగ్లాదేశ్ ల మధ్య రెండో సెమీస్ జరుగనుంది.
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
ENG | 3 | 3 | 0 | 6 | 1.04 | |
BAN | 3 | 1 | 1 | 3 | 0.00 | |
AUS | 3 | 0 | 1 | 2 | -0.99 | |
NZ | 3 | 0 | 2 | 1 | -1.05 |
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
IND | 3 | 2 | 1 | 4 | 1.37 | |
PAK | 3 | 2 | 1 | 4 | -0.68 | |
SA | 3 | 1 | 2 | 2 | 0.16 | |
SL | 3 | 1 | 2 | 2 | -0.79 |