లండన్:టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్ మన్ గా ధావన్ గుర్తింపు సాధించాడు. తద్వారా ఇప్పటివరకూ భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును ధావన్ బద్దలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఫీట్ ను ధావన్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి వెయ్యి పరుగుల మార్కును చేరుకున్నాడు.
దక్షిణాఫ్రికా విసిరిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో ధావన్ 78 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో వేగవంతపు వెయ్యి పరుగుల్ని సాధించడానికి సచిన్ కు 18 ఇన్నింగ్స్ లు అవసరమైతే, ధావన్ కు 16 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరమయ్యాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ పై 68 పరుగుల సాధించిన ధాన్.. శ్రీలంకపై 125 పరుగులు చేశాడు. 2013లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ధావన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ధావన్ 363 పరుగులతో అత్యధిక పరుగుల్ని నమోదు చేశాడు.
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
ENG | 3 | 3 | 0 | 6 | 1.04 | |
BAN | 3 | 1 | 1 | 3 | 0.00 | |
AUS | 3 | 0 | 1 | 2 | -0.99 | |
NZ | 3 | 0 | 2 | 1 | -1.05 |
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
IND | 3 | 2 | 1 | 4 | 1.37 | |
PAK | 3 | 2 | 1 | 4 | -0.68 | |
SA | 3 | 1 | 2 | 2 | 0.16 | |
SL | 3 | 1 | 2 | 2 | -0.79 |