ఇస్లామాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ సోహైల్ షాకిచ్చాడు. గతంలో సయీద్ అన్వర్తో భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించిన మాజీ కెప్టెన్.. రిటైర్మెంట్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్గానూ వ్యవహరించిన ఈ క్రికెటర్ పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. మరో రెండు రోజుల్లో భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ జట్టు మ్యాచ్లు ఫిక్సింగ్ కు పాల్పడి ఉండొచ్చునని సోహైల్ శుక్రవారం బాంబు లాంటి వార్త పేల్చాడు.
ఫిక్సర్ల సాయంతోనే ప్రత్యర్ధి జట్లకు భారీగా నగదు ముట్టజెప్పడంతోనే పాక్ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడేలా ప్లాన్ చేసి ఇంగ్లండ్తో సెమీఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నెగ్గారన్న వాదనలు తెరపైకి తెచ్చాడు. పాకిస్తాన్లో ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. టోర్నీ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పి ఇంగ్లండ్పై పాక్ విజయం సాధించిందని, పాక్ బడా వ్యాపారవేత్తల హస్తం ఉందని పాక్ మాజీ కెప్టెన్ అంటున్నాడు. పాక్ మైదానంలో ఆటతీరుతో కాకుండా జట్టుతో పాటు ప్రస్తుత కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫిక్సింగ్ ఉదంతానికి పాల్పడ్డాడని సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సర్ఫరాజ్ ఈ మైదానంలో ఏ మాత్రం రాణించలేదని, ఫిక్సింగ్లో అతడి హస్తం కచ్చితంగా ఉండొచ్చునని సోహైల్ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఉత్తమ ప్రదర్శణతో పాక్ ఫైనల్ చేరలేదని, ఇతరత్రా కారణాల వల్లే తుది మెట్టుకు చేరుకోగలిగిందని అభిప్రాయపడ్డాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సహా ఆటగాళ్లు ప్రస్తుతానికి స్పందించలేదు. అయితే వారి ఆటపై మాత్రం సోహైల్ ఆరోపణలు ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు చెబుతున్నారు.
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
ENG | 3 | 3 | 0 | 6 | 1.04 | |
BAN | 3 | 1 | 1 | 3 | 0.00 | |
AUS | 3 | 0 | 1 | 2 | -0.99 | |
NZ | 3 | 0 | 2 | 1 | -1.05 |
P | W | L | PTS | NRR | ||
---|---|---|---|---|---|---|
IND | 3 | 2 | 1 | 4 | 1.37 | |
PAK | 3 | 2 | 1 | 4 | -0.68 | |
SA | 3 | 1 | 2 | 2 | 0.16 | |
SL | 3 | 1 | 2 | 2 | -0.79 |